
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న చిత్రం నాయక్. దీనికి ట్యాగ్ లైన్ ‘ది లీడర్ ’ అని పెట్టారు. దాదాపు షూటింగు చివరి దశలో ఉన్న ఈ సినిమా ఆడియోని వచ్చే నెల 25 తారీఖున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆడియో వేడుకలో మెగా ఫ్యామిలీ పవర్ చూపించబోతున్నారని సమాచారం. అంటే... మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలంతా ఈ ఆడియో వేడుకకి రాబోతున్నారు. గతంలో రచ్చ ఆడియో వేడుకకు పవన్, గబ్బర్ సింగ్ ఆడియోకు రామ్ చరణ్ గైర్హాజరవ్వడంతో... మెగా కుటంబంలో విబేధాలు ఉన్నాయంటూ పుకార్లు షికార్లు చేసాయి. ఈసారి అలా జరుగకుండా ఉండేందుకు నాయక్ ఆడియో వేడుకలో మెగా ఫ్యామిలీషో ఇచ్చి ఇటు అభిమానుల కోరిక తీర్చడమే కాకుండా, పుకార్లకు కూడా తెర దించాలని భావిస్తున్నారట. మరి పవన్ హాజరవుతాడో లేదో చూడాలి.