
బెజవాడ కనకదుర్గమ్మ దసరా సందర్భంలో మరింత తేజోవంతంగా విరాజిల్లుతోంది. విజయవాడలో జరుగుతున్న శరన్నవరాత్రుల్లో కనకదుర్గమ్మ భక్తులను కటాక్షిస్తున్నారు. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన శుక్రవారం పూట మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచే అమ్మను దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. మహాలక్ష్మి రూపంలో ఉన్న అమ్మను మొక్కితే .. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. దీంతో అశేష సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ ఒక్కరోజే లక్ష మంది వరకూ భక్తులు వచ్చే అవకాశమున్నట్టు అంచనా. భక్తులకు అసౌకర్యం కలుగకుండా దేవస్థానం యుద్ధప్రాతిపదికన మరిన్ని చర్యలు చేపట్టింది.
...avnk