|
ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయంలో విమాన గోపురానికి శుక్రవారం మహాకుంభాభిషేకం వైభవంగా జరిగింది. ఈ కుంభాభిషేకంలో దేవాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్య, కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 పవిత్ర నదీ జలాలతో త్రి సముద్ర జలాలకు జయేంద్ర సరస్వతి కలశ పూజ చేశారు. అనంతరం దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. దోషాల నివారణ కోసం పన్నెండేళ్లకి ఒకసారి మహా కుంభాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంత్రి రామచంద్రయ్య మాట్లాడుతూ పండుగల తేదీలపై ఏర్పడ్డ సందిగ్ధతను త్వరలోనే తొలగిస్తామన్నారు. అందుకు సంబంధించి క్యాలెండర్‑ను తయారు చేస్తామన్నారు.
|