
దక్షిణ మధ్య రైల్వే జనరల్ బోగీల్లో ప్రయాణించే ప్యాసింజర్ల వెతలు ఇంతకాలానికి కొంచెంగా గుర్తించింది. చాలా సందర్భాల్లో రద్దీ, టికెట్లు లభించినా సీట్లు లభించకపోవడంవంటి ఇబ్బందులపై మొత్తానికి స్పందించింది. దసరా సందర్భంగా నెలకొన్న రద్దీని దృష్టిలో ఉంచుకొని మూడు రోజుల ముందే జనరల్ టికెట్లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చునని సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు టికెట్ల కోసం ఇబ్బందులు పడకుండా ప్రయాణానికి మూడు రోజుల ముందే టికెట్లు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ వెసులుబాటును ప్రయాణీకులు ఉపయోగించుకోవాలని విజ్ణప్తి చేశారు.
...avnk