
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శిల్పారామంలో దసరా పండుగ పురస్కరించుకుని హస్తకళా మేళా ఏర్పాటైంది. దీనిని మంత్రి వట్టి వసంత కుమార్ ప్రారంభించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, శిల్పారామం ప్రత్యేకాధికారి జీఎన్ రావు పాల్గొన్నారు. ఇందులో చేతివృత్తులవారు రూపొందించిన కొయ్యబొమ్మలు, జరీ, జర్దోజీ ఎంబ్రయిడరీలతో పాటు కళాకారులు గీసిన చిత్రాలు విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హస్త కళాకారులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. బతుకమ్మ, జానపద, డప్పుల నృత్యాలు, చిందు యక్షగానం తదితర సాంస్కృతిక కదంబాలు ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ నెల 28 వరకు మేళా కొనసాగుతుంది.
...avnk