
వర్షాకాలం పూర్తికావచ్చింది. కానీ నగరానికి నీటిని అందిస్తున్న ప్రధాన జలాశయాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో నిల్వలు పెరగలేదు. ఇప్పుడున్న నీటి నిల్వలతోనే వచ్చేయేడాది వేసవిలోనూ సరఫరా చేయాల్సి ఉంటుంది. అంతంత మాత్రం గా చేరిన నీటితో అధికారులు ఎలా సర్ధుబాటుచేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. నిజానికి ప్రతి వర్షాకాలంలో జలాశయాల్లోకి నీరు చేరుతూవచ్చి ంది.కానీ ఈసారి మాత్రం నీటి నిల్వ లు పడిపోయాయి. భారీ వర్షాలు కురిసినా ప్రధాన జలాశయాల పరివాహక ప్రాంతాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలులేవు.
దీంతో నగరానికి ప్రధాన వనరుగా ఉన్న నాగార్జు నసాగర్, సింగూరు, ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లలో పరిస్థితి ఆందోళనకంగా ఉంది.ఈపరిస్థితిని గమనించిన అధికారులు అప్పుడే ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఒక వేళ పరిస్థితి మరింత జఠిలంగా మారితే ఏం చేయాలన్న విషయంపై మెట్రోవాటర్బోర్డు వద్ద ప్రస్తుతం ఏ విధమైన ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదు.