
స్వైన్ ఫ్లూ ప్రజలను వణికిస్తోంది. ఇప్పటికే గ్రేటర్లో ఐదుగురు స్వైన్ఫ్లూతో మృతి చెందారు. దాదాపు 95 మందికిపైగా స్వైన్ఫ్లూ బారిన పడ్డా రు. అనేక మంది స్వైన్ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నప్పటికీ అటు ప్రభుత్వానికి, ఇటు అధికారుల కు ఏ మాత్రం పట్టడం లేదు. వైరస్ను కట్టుదిట్టం చేయడంలో ఎటువంటి ప్రత్యామ్నాయం మార్గాలను చేపట్టడం లేదు. వాతావరణంలోని మార్పులతో స్వైన్ఫ్లూ విజృంభించే ప్రమాదముందని తెలిసినప్పటికీ అధికారుల్లో చల నం లేదు. పైగా కార్పొరేట్, ప్రైవే టు ఆస్పత్రులకు వచ్చే స్వైన్ఫ్లూ వివరాలను వెల్లడించవదని నిబంధన విధి స్తున్నారు.
దీంతో అనేక స్వైన్ఫ్లూ కేసు లు నగరంలో ఉన్నప్పటికీ అధికా ర యంత్రాంగం మాత్రం ఏమీ లేదని తప్పించుకుంటోంది. సీజన్ మార్పు సమయంలో స్వైన్ఫ్లూ వచ్చే ప్రమాదముందని తెలిసినప్పటికీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలేదు. గతంలో ఇలాంటి నిర్లక్ష్యం వల్ల నే వేల మంది స్వైన్ఫ్లూ బారిన పడ్డా రు. ఈ సారి కూడా అదే నిర్లక్ష్యంతో అధికారులు ఉండడంతో స్వైన్ఫ్లూ విజృంభించే ప్రమాదం నెలకొంది.