మంత్రివర్గ మార్పులు చేర్పులు చమురుశాఖ మంత్రి జైపాల్రెడ్డిని తప్పించి ఆ బాధ్యతను వీరప్పమొయిలీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఆయన రాకతో ఇప్పటి వరకు చమురు రంగంలో నిలబడిపోయిన ఫైళ్లకు మోక్షం లభిస్తుందని చమురు రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. ఇదే గనుల జరిగితే రిలయన్స్ ఇండస్ట్రీకి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది. దీంతో పాటు భారత దేశానికి చెందిన చమురు సహజ వాయువు రంగానికి కూడా మేలు జరగుతుంది. ఇప్పటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీకి చమురు మంత్రిత్వశాఖకు మధ్య పెద్ద ఎత్తున యుద్ధం లాంటిదే జరిగిందనే చెప్పవచ్చు. వీరప్పమొయిలీ రాకతో అవ సద్దుముణగవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.
కేజీ 6 బ్లాకులో రిలయన్స్ను చమురు తవ్వకాలకు అనుమతించే అవకాశం ఉంది. రిలయన్స్కు చమురు మంత్రిత్వశాఖకు మధ్య ఉన్న కీలక అంశాలపై భేదాభిప్రాయాలు తొలగిపోవచ్చు. ఇరువురి మధ్య ఉన్న ఆడిటింగ్ సమస్య ఒక కొలిక్కి రావచ్చు... కంపెనీలో కేజీ డీ6లో అదనపు గ్యాస్ ఉత్పత్తికి రిల్ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్తులో రిలయన్స్ ఇండస్ట్రీ షేరులో కదలికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సోమవారం నాడు స్టాక్ మార్కెట్ ప్రారంభం కాగానే రిలయన్స్ షేరు పెరుగుతూ వచ్చింది. సెప్టెంబర్ 17వ తేదీన రిలయన్స్ రూ.881.60 వద్ద ముగిసింది. ఇటీవల కొన్ని రోజుల ముందు కూడా రిల్ 10 శాతం క్షీణించి రూ.760 స్థాయికి పడిపోయింది. వీరప్పమొయిలీ చమురుశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రిలయన్స్కు లబ్ధి చేకూరుతుందని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తులో రిలయన్స్ షేరు రూ.905 స్థాయికి ఎగబాకవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
