భారత క్రికెట్ జట్టుకు సారథ్యం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు భారత యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రకటించాడు. తనకు టీమిండియా కెప్టెన్సీ వస్తే మిస్ చేసుకోనని ఈ 23 ఏళ్ల యంగ్ క్రికెటర్ వెల్లడిచారు.గత యేడాది కాలంగా మంచి ఫామ్లో అంతర్జాతీయ క్రికెట్లో మేటి క్రికెటర్గా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ... ఇప్పటి వరకు 90 వన్డేల్లో 13 సెంచరీలు, 10 టెస్టుల్లో రెండు సెంచరీలు చేసి, తన సత్తా చాటాడు. ముఖ్యంగా ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్లో నిలకడగా రాణించి భారత్ తరుపున అత్యధిక పరుగులు సాధించాడు.దీంతో భవిష్యత్ టీమిండియా కెప్టెన్ కోహ్లీయేనంటూ క్రికెట్ పండితులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. వీటిపై గతంలో స్పందించిన విరాట్.. ఇప్పట్లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే ఉద్దేశ్యం లేదని చెప్పారు. అయితే, ఇపుడు తన మనస్సు మార్చుకున్నాడు. బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు.