
ఐసీసీ ప్రపంచ ట్వంటీ20 కప్ టోర్నమెంట్ లో సూపర్ 8 రౌండ్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ విజయం సాధించి సెమీఫైనల్ ఆశల్ని సజీవంగా ఉంచుకొంది. పాకిస్థాన్ నిర్ధేశించిన 150 పరుగుల విజయలక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 117 పరుగులకు చేసింది. దాంతో పాకిస్థాన్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ హస్సీ ఒంటరి పోరాటంతో 54 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు .
అంతకుముందు ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. పాకిస్థాన్ జట్టులో అత్యధికంగా నాసిర్ జెమ్ షెడ్ 55, కమ్రాన్ అక్మల్ 32, అబ్దుల్ రజాక్ 22 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా జట్టులో స్టార్క్ 3, దోహర్తి, వాట్సన్, కమిన్స్ చెరో వికెట్ పడగొట్టారు.
