
డాక్టర్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మాతగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తన ఫ్యామిలీ హీరోల చిత్రాలకు ఆమె నిర్మాతగా చేసి తనకు గుర్తింపు తెచ్చుకుంది లక్ష్మీప్రసన్న. అయితే తనలో ఉన్న ఒక నటి ఉందని గుర్తించి మొదటిగా ప్రతినాయికగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. అక్కడితో ఆగకుండా లక్ష్మీ మరో అడుగు ముందుకు వేసి వెండితెరపై హీరోయిన్ గా నటిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనకు పదును పెట్టి వెంటనే ‘గుండెల్లో గోదారి’ సినిమాలో హీరోయిన్ వేషం కట్టింది. బుల్లి తెర మీద టాక్ షోలతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది లక్ష్మీ . ఇప్పుడు మంచు లక్ష్మీ ఒక విఐపి. సార్ట్ సెలబిట్రీలలో ఒకరుగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ‘గుండెల్లో గోదారి’ కొత్త దర్శకుడి దర్శకత్వంలో వస్తున్న సినిమాకు తనే నిర్మాతగా ఉండటం విశేషం. అయితే లక్ష్మీ ఒకేసారి తెలుగు , తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో పినిశెట్టి ఆది, తాప్పి, సందీప్ కిషన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రవిరాజా పినిశెట్టి తనయుడైన ఆది తొలి ప్రయత్నం తెలుగులోనే చేసినా, అతనికి తమిళనాటే ఆదరణ దక్కింది. విభిన్న కథా చిత్రాల నాయకుడిగా తమిళనాట పేరు తెచ్చుకున్న ఆది తెలుగులో బ్రేక్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఈ యంగ్ బ్లడ్ అందరితో కలిసి వయసులో వారి కంటే చాలా పెద్దదైన మంచు లక్ష్మి చూపించిన హీరోయినిజమే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని మంచు ఫ్యామిలీ చెప్పుకుంటోంది. అయిన లక్ష్మీలో అంత సీన్ ఉందా? ఆమె ఈ సినిమా కు ప్రధాన హైలెట్ గా ఉంటుందా? ఈ చిత్రంతో లక్ష్మీ స్టార్ హీరోయిన్ గా మారిపోతుందా? ఆమె హీరోయినిజం చూడాలంటే.. సినిమా తప్పగా చూడాల్సిందే.