
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడు ప్రశాంతంగా హాయిగా నవ్వుతూ కనిబడే హీరో . అయితే ఈ రోజు ఆయన మీడియా మీద సిరీయస్ అయినట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల క్రితం తన భార్య స్నేహ కు చిన్న యాక్కిడెంట్ అయిన విషయం తెలిసిందే అయితే అవి స్వల్ప గాయాలు మాత్రమే అని డాక్టర్లు చెప్పటం జరిగింది. కానీ మీడియా వారు చాలా హై టెన్షన్ క్రియేట్ చేయటంతో.. మ్యాటర్ చాలా సిరియస్ గా ఉందని మీడియా హాడవుడి చేసింది. అయితే ఈ విషయం క్షణాల్లో రాష్ట్రం అంత వ్యాపించింది. బన్నీ అభిమానులకు, మెగా అభిమానులకు చాలా ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. కానీ మీడియా వారు మాత్రం దీని పై చర్చవేదికలు పెట్టినట్లు తెలుస్తోంది. అసలు స్నేహ సెలబ్రిటీ కాకపోయిన మీడియా హై లెవల్ లో ఫోకస్ చేయటంతో ఆమె పరిస్థితి గురించి తెలుసుకోవటానికి , స్నేహితులు, శ్రేయోభిలాషులు, అల్లు అర్జున్ కు, అల్లు అరవింద్ కాల్స్ చేస్తున్నారట. జరిగింది చిన్న సంఘటనే అయినా దానిని మీడియా ఇంత ఫోకస్ చేసి తమని బాగా డిస్టర్బ్ చేసిందని అల్లు అర్జున్ ఫీలైపోతున్నాడని ఫిలింనగర్ ప్రజలు అనుకుంటున్నారు. మీడియా అతిగా ఫోకస్ చేయడం వల్ల చాలా మంది టెన్షన్ పడ్డారని తెలుస్తోంది. కొంత మంది అయితే అల్లు అరవింద్ ఇంటికే వస్తున్నారట. వారు ప్రతి ఒక్కరి చెప్పలేక బాధపడుతున్నారని తెలుస్తోంది. అయితే ఒకనొక సమయంలో మీడియా పై బన్నీ సీరియస్ అయినట్లు టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.
