
మొన్నటి వరకు బయట ప్రపంచంలో తిరిగిన జగన్. ఇప్పుడు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది జగన్ పై అనేక ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. జగన్ చేసిన అవినీతి పక్కన పెట్టి ఆయనకు హారతి పట్టడానికి మాజీ మేయర్ తాడి శకుంతల ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె ఉపన్యాసాలు ఇవ్వడంలో కమ్యూనిస్టు భావజాలం ఉన్న విషయం తెలిసిందే. అయితే కమ్యూనిజాన్ని వదలి ఇతర పక్షాలలో చేరినప్పుడు వారు చేసే ప్రసంగాలు కూడా జనాన్ని బాగా ఆకట్టుకుంటాయాని అందరికి తెలిసిన విషయమే.

ఇటీవల విజయవాడలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో విజయమ్మ నేతృత్వంలో దర్నా జరిగిన సందర్భంలో శకుంతల ఆవేశపూరిత ప్రసంగం చేసినట్లు తెలుస్తోంది. ఉద్యమాల గడ్డ విజయవాడలో విజయమ్మ శంఖారావం పూరించారని శకుంతల చెప్పటంతో.. అందరు ఒక్కసారి షాక్ తిన్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. అంటే ఆమె ఉద్దేశం జగన్ జైలు గోడలు బద్దలు కొట్టుకొని బయటకు వస్తారని, జగన్ ఒక అల్లూరి సీతారామరాజు మాదిరిగా పోరాడతారని ఆవేశపూరితంగా ఆమె మాట్లాడుతుంటే జనం కూడా బాగానే చప్పట్లు కోట్టినట్లు వైఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. వై.ఎస్.ఆత్మ శాంతించేలా నినదించాలని కూడా ఆమె పిలుపు ఇచ్చినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. తాడి శకుంతల వంటి నేతల ఉపన్యాసాలు వినడానికి బాగానే ఉంటాయి కాని , వాటిలో అర్ధాన్ని వెతకకూడదని వైఎస్ విజయమ్మ పార్టీ నాయకులకు చెప్పినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. అయిన శకుంతల ఉపన్యాసాం విజయమ్మ కూడా కొంత తలనొప్పిగా మారిందని పార్టీ నాయకులు అంటున్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిని అల్లురి సీతారామారాజు ఎక్కడ? అవినీతి కి ప్రథమ పుత్రుడైన జగన్ ఎక్కడ? అని కాంగ్రెస్ నాయకులు చెవులు కొర్కుకుంటున్నారు.
