కొత ఇన్నింగ్స్ కు మెగా ఫ్యామిలీ డోర్లు తెరిచినట్టు సంకేతాలందుతున్నాయి. ఇందులో భాగంగానే విశాఖపట్నంలో ఫిలిం స్టూడియో నిర్మాణానికి ప్రముఖ నటుడు చిరంజీవి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు విశాఖలో ధ్రువీకరించారు. కొత్త స్టూడియోల నిర్మాణానికి హైదరాబాదులో అడ్డంకులు ఏర్పడుతున్న నేపథ్యంలో, చిరంజీవితో బాటు పలువురు సినీ ప్రముఖులు విశాఖలో స్టూడియోలు నిర్మించడానికి ముందుకు వస్తున్నారని మంత్రి చెప్పారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రభుత్వ అనుమతికి దరఖాస్తులు పెట్టుకున్నారని ఆయన అన్నారు. కాగా, మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి చిరంజీవి అంతర్జాతీయ స్థాయిలో స్టూడియో నిర్మాణానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రాజక్టు డిజైన్లో అంతర్జాతీయ ఇంజనీర్లు సైతం పాలు పంచుకుంటున్నారు. సకల సదుపాయాలతో, భారీ వ్యయంతో ఈ స్టూడియో నిర్మాణం జరుగనుంది.
..avnk