
ప్రముఖ ప్రొడ్యూసర్ డివివి దానయ్య వ్యవహారం చిలికి చిలికి గాలివాన లాగా తయారయ్యింది. పూరీ దర్శకుడిగా, దానయ్య నిర్మాతగా, పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ’ విషయంలో పూరీ జగన్నాథ్ నిర్మాత తనకు ఇవ్వాల్సిన రూ. 4.5 కోట్లు ఎగ్గొట్టారని పూరి దర్శకుల సంఘంలో ఫిర్యాదు కూడా చేసారు. కానీ పూరీ జగన్నాథ్ తరువాత ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు. కానీ దర్శకుల సంఘం మాత్రం తాజాగా దానయ్యకు బుధవారం వరకు డెడ్ లైన్ విధించింది. పూరీకి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించక పోతే... నిర్మాతల మండలి సహాయ నిరాకరణ చేస్తుందని హెచ్చరించింది. అయితే పూరీ తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నా.... దర్శకుల సంఘం ఇలా చేయడానికి దానయ్య గతంలో చెల్లించాల్సిన ట్యాక్స్ లు కట్టకపోవడం వలనే ఇలా డెడ్ లైన్ విధించారని సినీవర్గాల సమాచారం.
