
ఒకప్పుడు వెండితెరమీద హీరోయిన్లుగా నటించేందుకు వెనకడుగు వేసిన ప్రముఖ హీరోల కూతుళ్లు ఇప్పుడు నటించేందుకు ముందుకు వస్తున్నారు. మొన్న కమల్ కూతురు శ్రుతి తెరంగేట్రం చేస్తే ఇప్పుడు యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు వంతు వచ్చింది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అర్జున్ నటించిన ‘జెంటిల్ మెన్’ మరియు ‘ఒకే ఒక్కడు’ చిత్రాల ద్వారా యాక్షన్కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అర్జున్ తన వారసత్వాన్ని తన కూతురుకి ఇవ్వనున్నారు. అర్జున్ కూతురి పేరు ఐశ్వర్య. ఆమె విశాల్ హీరోగా త్వరలో ప్రారంభం కానున్న ‘పట్టతు యానయ్’ అనే సినిమా ద్వారా కథానాయికగా పరిచయం కానున్నారు. ఈ చిత్రంలో ప్లస్ 2 చదివే అమ్మాయి పాత్రలో ఐశ్వర్య కనిపించనుంది. ఐశ్వర్య విజువల్ కమ్యూనికేషన్ కోర్స్ చేసారు. ఈ చిత్ర చిత్రీకరణ నవంబర్ 5 నుంచి మొదలవుతుంది.