
హాట్ బ్యూటీ నయనతార పేరు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈ దఫా విద్యాబాలన్ కథానాయికగా ఏక్తాకపూర్ హిందీలో నిర్మించిన డర్టీ పిక్చర్ రీమేక్ విషయమై. హిందీలో ఈ చిత్రం ఘన విజయం సాధించిన విషయం మనకు తెలుసు. దాంతో, దీనిని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేసే ఉద్దేశంతో, నయనతారను సదరు నిర్మాత తాజాగా సంప్రదించిందట. ఈ సినిమా నిండా శృంగార సన్నివేశాలు కలిగి వుండడం వల్ల నయన్ తన పారితోషికంగా రెండున్నర కోట్లు డిమాండ్ చేసిందనీ, అంత మొత్తాన్నీ ఇవ్వడానికి నిర్మాత కూడా ముందుకు వచ్చిందనీ అంటున్నారు. అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని నయనతార సన్నిహితులు చెబుతుండగా... ఇది వాస్తవమేననీ, త్వరలోనే అగ్రిమెంటు కూడా అవుతుందనీ మరోపక్క నిర్మాత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతకీ, ఏది నిజమో తెలియాల్సి ఉంది. అందుకు పెద్ద టైం కూడా అక్కరలేదు. త్వరలోనే నిజం పటాపంచలవుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
...avnk
