
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురు అయిన శ్రుతి హాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు సరైన హిట్లు లేక ఇబ్బందులు పడ్డ శ్రుతి హాసన్, గబ్బర్ సింగ్ సినిమాతో ఈ భామ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఈ సినిమా విజయవంతం కావడంతో శ్రుతి హాసన్కి అవకాశాల మీద అవకాశాలు వచ్చిపడుతున్నాయి., ప్రస్తుతం ఈమె మాస్ రాజా రవితేజ సరసన ‘బలుపు ’ సినిమాలో చేస్తుంది. ఇదే కాకుండా బాలీవుడ్ లో ‘నువ్వొస్తావంటే నేనొద్దంటానా ’ తెలుగు చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఇందులో కూడా నటిస్తూ బిజీబిజీగా ఉంది.
ఇటీవల ఫిలింనగర్ లో శ్రుతి హాసన్ రామ్చరణ్ చిత్రం నాయక్లో ఐటం సాంగ్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. వార్తల పై స్పందిచిన శ్రుతి హాసన్ తెలుగులో నేను ఒప్పకుంది ఒక్క చిత్రమే.. అది రవితేజ ‘బలుపు’. ఇక నాకు ఐటంసాంగ్ చేసే తీరిక లేదని తేల్చి చెప్పింది . శ్రుతి హాసన్ టైం లేక ఐటెం సాంగ్ చేయడం లేదా ? లేక తన రేంజ్ పెరిగిపోవడంతో ఈ సాంగుకు ఒప్పుకోలేదా ? అని టాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు.
