కింజారపు ఎర్రన్నాయుడు మృతి పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేసింది. ఆయన మృతికి భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన మరణం టీడీపీకి తీరని లోటు అని, ఆయన తెదేపాకి చేసిన సేవలు మరవరాని వని ఆ పార్టీ నేత సి.హెచ్ విద్యాసాగర్ రావు అన్నారు.ఎర్రన్నాయుడు మృతి పట్ల మన ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహా, తెరాస అధ్యక్షుడు కేసీఆర్, పలువురు రాష్ట్ర మంత్రులు సంతాపం తెలియజేశారు. వీరే కాకుండా జాతీయ నేతలు కూడా ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భాంత్రిని వ్యక్యం చేశారు. కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, పురంధరీశ్వరి, సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీతారం ఏచూరి, తమిళనాడు గవర్నర్ రోశయ్య ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన అందించిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు.
