
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యోడ్యురప్ప బీజేపీకి గుడ్ బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 10 తేదిన ప్రాంతీయ పార్టీని ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ మనగడపై అనుమానాలు వ్యక్తం చేశారు. 'బీజేపీ, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి.. డిసెంబర్ 10 తేదిన ప్రాంతీయ పార్టీని ప్రారంభిస్తున్నాను' అని యోడ్యురప్ప అన్నారు. తన కార్యాలయంలో ఆయుధ పూజ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఏర్పాటు ప్రస్తావన తీసుకువచ్చారు.