
ఎక్కడైన మనిషి పై పులి, కుక్క, ఎనుగు, ఎద్దు, లాంటి దాడులు చూశాం కానీ, ఎలుకలు మనిషి పై దాడి చేయటం ఇది తొలి సారి. వారం రోజుల కిందట తీవ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన దాడుల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనిక అధికారిని ఎలుకలు గాయపరిచాయి. ఢిల్లీలోని సైనిక స్థావర ఆసుపత్రిలో అతను ఉండగా.. కాలిపై ఎలుకలు పెద్దగా గాయాలు చేశాయి. అ విషయం తెలుసుకొన్న సైనిక ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అసలు ఆసుపత్రిలోకి ఎలుకలు ఎలా వచ్చాయంటూ.. ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇకపై అయినా ఆసుపత్రి పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.