
ఇందిరమ్మ బాట పేరుతో ముఖ్యమంత్రి కిరణ్‑కుమార్ రెడ్డి బలాదూర్‑గా తిరుగుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదని ఆయన అన్నారు. అధిష్టానం మెప్పు కోసమే సీఎం ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని రాఘవులు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కిరణ్ సర్కార్ వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు. చంద్రబాబు పాదయాత్రకు తాము మద్దతు ఇవ్వటం లేదని రాఘవులు తెలిపారు. పాదయాత్రలను భౌతికంగా అడ్డుకోవటం సరికాదని ఆయన అన్నారు.
