
ఈ దేశంలో మరుగుదొడ్లకంటే గుడులే ఎక్కువగా ఉన్నాయని ఒక సంచలనం! టాయ్లెట్ లేని ఇంటికి కోడలిగా వెళ్లొద్దు అంటూ మరో సంచలనం! ఈ సంచలన ప్రకటనల కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ మరో సంచలన ప్రకటన చేశారు. అపరిశుభ్రమైన, పాతకాలపు మరుగుదొడ్లను పడగొట్టాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. లేనిపక్షంలో... కేసులు పెడతామని హెచ్చరించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం బిల్లు రూపొందిస్తోందని తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, తాగునీరు, పారిశుధ్య శాఖ మంత్రిగా ఉన్న జైరామ్ రమేశ్ ఇవాళ (సోమవారం) రాజస్థాన్లోని కోటా జిల్లాలోని సంగోడ్ అనే పట్టణంలో మూడో విడత 'నిర్మల్ భారత్ యాత్ర' ప్రారంభించారు. 'టాయ్లెట్ లేదా... కోడలూ రాదు!' అనే అనే నినాదాన్ని పునరుద్ఘాటించారు. మొత్తం మీద మన అమాత్యుల పట్టుదల చూస్తుంటే, దేశానికి కొంతవరకూ మంచిరోజులు వచ్చాయేమోఅనిపించేస్తుంది కదూ..
...avnk