
సమాజంలో అబలలకు భద్రత అడవికాచిన వెన్నల మాదిరే ఉంటుంది. తాజాగా ఇవాళ ఆకతాయిల వేధింపులకు మరో యువతి బలైంది. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ సంతోష్ నగర్ లో చోటుచేసుకుంది. స్థానిక విజేత డిగ్రీ కాలేజీలో బిఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న హారికను గత కొద్దిరోజులుగా కొంత మంది ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తున్నారు. వేధింపుల పర్వం ఎక్కువ కావటంతో ఆమె నెలరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు అనంతరం పోకిరీలు వేధింపులు మరింతగా ఉధృతం చేశారు. దాంతో మనస్తాపంకు గురైన హారిక బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఆకతాయిల వేధింపుల వల్లే హారిక ఆత్మహత్య చేసుకుందని, ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
...avnk