
దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు పై తెలంగాణ వాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రగడ కోసం ప్రభుత్వం ఒక కమిటి నియమించి పరిష్కారం చెబుతామని చెప్పటం జరిగింది. రాంబాబు సినిమా లో వివాదాస్పద సీన్లు ఉన్నాయాని వారు రగడతో టాలీవుడ్ పరిశ్రమంలో కొత్త అలజడి మొదలైంది. రాంబాబు సినిమా మరో మంత్రి కూడా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది? కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో వివాదాస్పద సీన్లు లేవని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు . ఈ సినిమాపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ఆయన విశాఖ విమ్యాక్స్ ధియేటర్ లో ప్రత్యేక ప్రదర్శన వేయించుకొని సినిమాను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినిమాలో ఎక్కడా తెలంగాణ వాదలును కించపరిచే అంశలు లేవన్నారు. దీనిపై లేనిపోని రాధ్దాంతం చేయడం సమంజసం కాదని అన్నారు. దర్శక నిర్మాతలు, తెలంగాణ పంపిణీదారుల ఇళ్లపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
