
రాంబాబు కు టీ నాయకుల మద్దతు దొరుకుతుంది. తెలంగాణ వాదులు చేసిన అలజడి పై కాంగ్రెస్ పార్టీ చెందిన టీ నాయకులు మండిపడుతున్నారు. ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీ చేసిన అలజడిగా వారు చెబుతున్నారు. రాంబాబు పై కొంత మంది కావాలని పుకార్లు పుట్టిస్తున్నారని టీ నాయకులు మండిపడుతున్నారు.ఓ వైపు ప్రభుత్వం వేసిన కమిటీ వేసిన విషయం తెలిసిందే అయితే కొంత మంది పవన్ కల్యాన్ అభిమానులు డైరెక్టర్ శంకర్ కు బెదిరింపులు కాల్సు చేస్తున్నారని , ఆయన్ని చంపుతామనీ కూడా ఎస్ఎమ్ఎస్ లు చేస్తున్నారనీ శంకర్ చెబుతున్న మాటల్లో నిజం లేదని టీ నాయకులు అంటున్నారు. ఇదిలా ఉంటే, తెలంగాణ ఉద్యమ ముసుగులోటీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దాడులకు పాల్పడుతున్నాడనీ, డబ్బుల వసూళ్లకు దిగుతున్నాడనీ ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. సినీమా పరిశ్రమ హైదరాబాద్ నుంచీ తరలి వెళ్లడానికి టీఆర్ఎస్ కుట్ర పన్నుతోందన్నారు. టీఆర్ఎస్ పార్టీ రాజకీయ, ఉద్యమ పార్టీగా కాకుండా మిలిటెంటు పార్టీగా వ్యవహారిస్తుందనీ మండిపడ్డారు. సినీమాలో ఏమైనా అభ్యంతకర సన్నివేశాలుంటే తొలగించే పని సెన్సార్ బోర్డుదన్నారు. అంతేకానీ, బెదిరింపులకు పాల్పడటం కేసీఆర్ మానుకోవాలన్నారు. ఇదే పద్దతి అవలంభిస్తే ఇవే బెదిరింపులు ఏదో ఒకనాడు కేసీఆర్ మెడకు కూడా చుట్టుకోవడం ఖాయమన్నారు. హింసకు పాల్పడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. టీఆర్ఎస్ నేతలు తమ చేష్టలు మానుకోవాలనీ హితవు పలికారు. చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్, డిస్ర్టిబ్యూటర్ దిల్ రాజుల కార్యాలయలపై జరిగిన దాడిని జగ్గారెడ్డి ఖండించారు.
