విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు ’ సినిమా వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా పై తెలంగాణ వాదులు మండిపడుతుంటే... మరో ప్రక్క రాజగోపాల్ రాంబాబుకు సపోర్ట్ ఇస్తూ... కితాబు ఇస్తున్నాడు. ఆ సినిమా చక్కగా తీశారని, వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ వాదులు పూరీ కార్యాలయం పై దాడి చేయడాన్ని కూడా ఆయన ఖండించారు. అసలే మంట మీదున్న తెలంగాణ వాదులకు లగడపాటి వ్యాఖ్యలు మరింత మండేలా చేస్తున్నాయి. ఇక ఈ సినిమా పై కేసీఆర్ కూడా మండిపడుతున్నారు. సినిమా తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఉన్న మాట నిజమే అన్నారు. మహిళలు, వికలాంగుల పై అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, ఈ చిత్రంపై కెసిఆర్ ఫైర్ అయ్యారు.