చంద్రబాబు చేపట్టిన పాదయాత్రలో బాబుకు ఓ బుడతడు జోస్యం చెప్పాడు. దాంతో బాబు పులకించిపోయాడు. అసలు విషయం ఏంటంటే...ఇతగాడి పేరు ఈడిగ గోపాల్. చదివేది మూడో తరగతి. చంద్రబాబు అంటే ఎనలేని అభిమానం. బాబు ఎమ్మిగనూరు వస్తున్నారని తెలుసుకున్నాడు. పుస్తకం కొనుక్కోవాలంటూ తండ్రి దగ్గర మూడు రూపాయలు తీసుకున్నాడు. ఆటో ఎక్కి వచ్చేశాడు. ఎమ్మిగనూరు సరిహద్దు కోటేకల్ వద్ద బాబును చూడగానే పరుగున వెళ్లి నమస్తే సార్ అంటూ కరచాలనం చేశాడు. 'సార్ మీరు మరోసారి సీఎం అవుతారు' అంటూ తన అభిమానాన్ని చాటాడు. దాంతో, 'నీకు ఓటు హక్కు ఉండి ఉంటే నన్ను ఇప్పుడే సీఎంను చేసేలా ఉన్నావు' అని బాబు చమత్కరించారు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అని మన పెద్దలు చెబుతారు. మరి ఈ బడతడి జోస్యం ఎంత వరకు నిజం అవుతుందో 2014 ఎన్నికలలో చూడాలి.
