18 Jun Tuesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Director.gif

    Oct 19 ,2012 04:03 pm

    Director Puri Jagannath Office Attacked

    జూబ్లీహిల్స్‑లోని సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ కార్యాలయంపై తెలంగాణవాదులు దాడి చేశారు. ఫర్నీచర్‑ను ధ్వంసం చేశారు. మూడు కార్లకు కూడా ధ్వంసం చేశారు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో తెలంగాణవాదులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని వారు నిరసన తెలిపారు. ఆ చిత్రాన్ని వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.   కెమెరామెన్ గంగతో రాంబాబు తెలంగాణ జిల్లాల్లో నిరసనల వెల్లువెత్తాయి. తెలంగాణవాదులు పలుచోట్ల థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేయాలని ఆందోళనకు దిగారు. నల్గొండ నటరాజు థియేటర్, నకిరేకల్ రామకృష్ణ థియేటర్లో తెలంగాణవాదులు చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు.

    Director Puri Jagannath Office Attacked

    ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఎమ్మెల్యే అరవింద రెడ్డి ఈ సినిమా చిత్ర ప్రదర్శనను అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో ఈ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్‑పై తెలంగాణవాదులు దాడి చేసి, ప్రదర్శనను అడ్డుకున్నారు.ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే వివాదాస్పద సన్నివేశాలు, మాటలు తొలగిస్తామని  కెమెరామెన్ గంగతో రాంబాబు దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పారు.  మేము ఎంతో కష్టపడి ప్రజల వినోదం కోసం సినిమా తీస్తాం ? కానీ ఒళ్ళు బలిసి  సినిమాలు తీయ్యలేదు.  ముందు రాంబాబు సినిమా చూడండి . అందులో మీకు అసభ్యంగా అనిపించే సన్నివేశాలు చెప్పండి వెంటనే తొలిగిస్తానని  పూరి చెప్పినట్లు తెలుస్తోంది.  నా దర్శకత్వంలో ప్రజలను ఇబ్బంది పెట్టాను.

    Director Puri Jagannath Office Attacked

    రాంబాబు సినిమాను అడ్డుకోవద్దు:దిల్‌రాజు

    తెలంగాణవాదుల ఆందోళనలపై ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు స్పందించారు. పూరీ జగన్నాథ్‌తో మాట్లాడి అభ్యంతరకర సన్నివేశాలను తొలగిస్తామని ఆయన తెలిపారు. సినిమాను అడ్డుకోవద్దని తెలంగాణవాదులకు ఆయన పిలుపునిచ్చారు.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers