సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ రావు గ్రీన్ ఫీల్డ్ భూముల అక్రమాల కేసులో ఆయనను విచారించేందుకు సైబరాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. దీంతో శంకరన్నను ఏ క్షణంలోనయినా అరెస్టు చేయవచ్చంటున్నారు. ఎప్పుడు మీడియా ముందు నోటికివచ్చినట్లు మాట్లాడే శంకరన్న ఈ కేసు పై కోర్టు స్టే ఎత్తి వేసిన వెంటనే ఎక్కడ అరెస్టు చేస్తారోనని భయపడి ప్రస్తుతం హైదరబాదును విడిచి పెట్టి వెళ్ళినట్లు సమాచారం. మహారాష్ట్రలోని శనీశ్వర దేవాలయం శని సింగ్నాపూర్ దర్శించుకునేందుకు వెళ్లారట. ఇటీవలి కాలంలో శంకరన్నను శని వక్రంగా చూస్తున్నాడనీ, అందువల్ల మొక్కు చెల్లించుకునేందుకు వెళ్లారని అంటున్నారు. ఐతే మరికొందరేమో.. అరెస్టు భయంతోనే అక్కడికి వెళ్లి ఉంటారని చెపుతున్నారు.