వైయస్ రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానంతో ఆయన కుమారుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చాలా మందే కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ఆ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచారు. కానీ ఇప్పటి వరకు మాత్రం అనకాపల్లి ఎంపీ సబ్బం హరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఉంటూ కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నాడు. కానీ అతను కూడా త్వరలో కాంగ్రెస్ కి గుబ్ బై చెప్పబోతున్నాడు దానికి ముహూర్తం కూడా ఖరారా చేసుకున్నాడు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్ర సందర్భంగా ఆ పార్టీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పై ఆయన జైల్లో జగన్ ని కలిసి మాట్లాడినట్లు సమాచారం. ఈయనతో పాటు కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకులు కూడా ఆ పార్టీలో చేరబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
