
రాష్ట్ర ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట పేరుతో పర్యటనలో భాగంగా ప్రకాశం జిల్లాలో చేస్తున్నా విషయం తెలిసిందే. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే రెండు రోజులు ఇందిరమ్మ బాట ప్రకాశం జిల్లాలో పూర్తి చేశారు. ఈ రోజు సిఎంకు చివరి రోజు. ప్రకాశం జిల్లా హెడ్ క్వాటర్ అయిన ఒంగోలు లో సీఎం ఈ రోజు ఇందిరమ్మ బాట లో పాల్గొంటారు. చివరి రోజు కావటంతో ఒంగోలు, సంతనూతలపాడు, నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఈ రోజు ఉదయం ఒంగోలు రిమ్స్ నర్సింగ్ కళాశాల కొత్త భ్లాక్ కు , బదిర పాఠశాలకు శంకుస్థాపన చేస్తారు. వికలాం బాలబాలిలకు పరికరాలు అంద చేసి.. రిమ్స్ లో ఆరోగ్య శ్రీ లభ్దిదారులతో భేటీ అవుతారు. సాయంత్రం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి అక్కడి నుంచి హెలికాప్టర్ లో విజయవాడకు చేరుకుని విమాన మార్గంలో హైదరాబాద్ కు బెయలుదేరుతారు.
