
కంప్యూటర్ యుగంలో కూడా దేశంలో ఇంకా కొన్ని గ్రామాల్లో మూఢనమ్మకాలు పోవడం లేదు. తన నలుగురు పిల్లలపై అక్రమ సంతానం అనే అపవాదు రాకుండా ఉండటానికి చనిపోయిన వ్యక్తిని ఒక మహిళ పెళ్లాడిన సంఘటన బీహార్లో బన్కా జిల్లాలోని ఒక కుగ్రామంలో చోటు చేసుకుంది. 30 ఏళ్ల చుడ్కి హెమ్బ్రామ్ అనే గిరిజన మహిళ గిరిజన ఆచారాల ప్రకారం మహన్లాల్ మారండీ అనే వ్యక్తితో సహజీవనం చేసేది. తోటలో పని చేసే వీరిద్దరికీ నలుగురు పిల్లలు. ఆరోగ్య కారణాలతో మారండీ మృతి చెందారు. తన పిల్లలకు అక్రమ సంతానం అనే అపవాదు రాకుండా ఉండేందుకు హిందూ సంప్రదాయాల ప్రకారం జీవిత భాగస్వామి మారండీ శవాన్ని ఆమె పెళ్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత మారండీకి దహన సంస్కారాలు పూర్తి చేశారు. చుడ్కి నుదుటిపై సింధూరాన్ని తొలగించి వితంతువుగా మార్చే కార్యక్రమాన్ని నిర్వహించారు.