ఈకాలం పిల్లలు నెయ్యి వేసుకొని అన్నం తినమంతే... మమ్మీ నెయ్యి వేసుకొని తింటే నేను లావెక్కిపోతాను... నాముఖం పై ముటిమలు వస్తాయి అంటూ కారణాలు చెబుతున్నారు. పూర్వకాలం నుండే నెయ్యికి చాలా ప్రాధాన్యత ఉంది. కాలంతో పాటు నెయ్యి తినేవారు కూడా తక్కువైపోయారు. కానీ నెయ్యి తినడం వలనే ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ)కి చెందిన శాస్త్రవేత్తలు.ఆవు నెయ్యి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగకపోగా.. అది మనల్ని కేన్సర్ నుంచి కూడా రక్షిస్తుందని శాస్త్రవేత్తలు ఇప్పుడు తేల్చిచెబుతున్నారు. కేన్సర్ కారక పదార్థాలను విషరహితం చేయడానికి అవసరమైన ఎంజైమ్లను ఆవునెయ్యి పెంచుతుందని, తద్వారా కేన్సర్ కలగజేసే కణాల అందుబాటును తగ్గిస్తుందని రక్తంలో ఉండే హెచ్డీఎల్ గుండెకు మంచి చేస్తుంది. నెయ్యి తినడం వల్ల అది పెరుగుతుందని తెలిపారు.