ప్రభుత్వాల తీరుతో ప్రజలే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడా విసిగిపోయి ఉద్యమాలు చేస్తున్నారు. తాజాగా బీహార్ రాష్ట్రానికి చెందిన 65,000 వేల మంది పోలీసులు తమకు జీతాల పెంపుతో పాటు, ఇతర డిమాండ్ల సాధన కోసం ఏకంగా 5 రోజుల పాటు సెలవు పెట్టనున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం... ఇతర రాష్ట్రాల వారితో పోల్చితే ఒకే గ్రేడ్ జీతాల్లో రూ.2,000 తక్కువగా అందుకుంటున్నామని, ప్రతీ నలుగురు కానిస్టేబుళ్లకు ఒక హవాల్దార్ను నియమించాలని బీహార్ పోలీస్మెన్స్ అసోసియేషన్(బీపీఏ) కోరింది. బుధవారం నుంచి విధులను బహిష్కరిస్తామని బీపీఏ అధ్యక్షుడు జితేంద్ర కుమార్ సింగ్ ప్రకటించారు. ఇంత పెద్ద మొత్తంలో పోలీసులు విధులను బహిష్కరిస్తే శాంతి భద్రతలకు కలుగుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి పోలీసు డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గుతుందో లేదో చూడాలి.
