
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప జిల్లా ఎంపీ వైయస్ జగన్ మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగిలింది. నిన్న ఆయన ఆస్తులను జప్తు చేయాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు సుప్రీం కోర్టులో బెయిల్ కోసం వేసుకున్న పిటీషన్ ని కూడా సుప్రీం కోర్టు తిరస్కరించింది. బెయిల్ తిరస్కరించడమే కాకుండా, విచారణ పూర్తయ్యే వరకు మళ్ళీ బెయిల్ పిటీషన్ కూడా వేయవద్దని ఆదేశిచింది.
జగన్ తరుపు న్యాయవాది జగన్ ఆరెస్టు అక్రమం అని, వెంటనే జగన్ ని విడుదల చేయాలని అన్నారు. జగన్ అక్రమాలకు పాల్పడక పోతే ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఇక సీబీఐ వారు ఇప్పటికే జగన్ అక్రమాస్తులను కొన్నింటిని గుర్తించామని, ఇంకా గుర్తించాల్సి ఉందని ధీనికి ఇంకా మూడు నెలల సమయం పడుతుందని అన్నారు. మొత్తానికి ఇటు ఈడీ, అటు సుప్రీం కోర్టు దెబ్బ మీద దెబ్బ తీశాయని, దీంతో జగన్ కొన్ని రోజులకు కోలుకునే ఛాన్స్ లేదంటున్నారు.
