ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్లు జోరు కొనసాగిస్తున్నారు. ఇవాళ బ్యాడ్మింటన్ విభాగంతో మన షెట్లర్లు కూడా మరో అడుగు ముందుకేసి పసిడి పతక సాధన దిశగా దృష్టి సారించారు. స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధూ సహా అటు రిత్వికా, ఇటు పురుషుల బ్యాడ్మింటన్ విభాగంలో కిదాంబి శ్రీకాంత్, హెఛ్ఎస్ ప్రణాయ్ తదితరులు ప్రీక్వార్టర్స్లోని అడుగుపెట్టారు. ఇవాళ కరారా స్పోర్ట్స్ అరేనాలో జరిగిన ఉమెన్స్ సింగిల్స్ మ్యాచ్లో సౌతాఫ్రికా క్రీడాకారిణి ఎల్సీ డీవిలియర్స్పై సైనా నెహ్వాల్ అలవోకగా విజయం సాధించింది.
లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన సైనా... సౌతాఫ్రికా క్రీడాకారిణిపై 21-3, 21-1 తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. కేవలం 18 నిమిషాల్లో తనదైన శైలిలో ఆట ముగించి ప్రీక్వార్ట్స్లోకి దూసుకెళ్లింది. ఇక కీలకమైన క్వార్టర్ ఫైనల్స్లోకి అడుగుపెట్టేందుకు సైనా ఐల్ ఆఫ్ మాన్కు చెందిన జెస్సికా లీతో తలపడనుంది. కాగా మరో ఉమెన్స్ సింగిల్స్ మ్యాచ్లో రియో ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధూ దుమ్మురేపింది. ఫిజికి చెందిన ఆండ్రా వైట్సైడ్పై 21-6, 21-3 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ కూడా కేవలం 18 నిముషాల్లో ముగియడం విశేషం.
మరోవైపు మెన్స్ సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ కూడా ప్రీక్వార్టర్స్లోకి అడుగుపెట్టాడు. 26 నిమిషాలు పాటు సాగిన ఈ మ్యాచ్లో మారిషస్కి చెందిన ఆటిష్ లూబాపై 21-13, 21-10 తేడాతో శ్రీకాంత్ విజయం సాధించాడు. తర్వాతి రౌండ్లో శ్రీకాంత్ శ్రీలంక క్రీడాకారుడు నీలుక కరుణరత్నేతో తలపడనున్నాడు. తాజా కామన్వెల్త్ క్రీడా సంగ్రామంలో భారత అథ్లెట్లు ఇప్పటి వరకు 24 పతకాలు సాధించగా.. అందులో 12 బంగారు పతకాలు, నాలుగు రజతాలు, ఎనిమిది కాంస్య పతకాలు ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more