అస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ తన హావాను కొనసాగిస్తుంది. భారత క్రీడాకారులు తమ అధ్భుత ప్రదర్శనలతో సత్తాను చాటుతూ పతకాల పంట పండిస్తున్నారు. మొత్తంగా పది పసిడి, నాలుగు రజత, ఐదు కాంస్య పతకాలతో మొత్తంగా 19 పతకాలను భారత క్రీడాకారులు కైవసం చేసుకుని కామన్వెల్త్ గేమ్స్ లో టాప్ త్రి ప్లేస్ లో కొనపాగుతుంది. అస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లాండ్ రెండో స్థానంలో వుంది. అయితే భారత్ మాత్రం మూడో స్థానంలోనే స్థిరంగా కొనసాగడం గమనార్హం.
ఇవాళ భారత్ ఖాతాలోకి మూడడు స్వర్ణాలు చేరాయి. పురుషుల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జీతూరాయ్ స్వర్ణ పతకాన్ని సాధించగా, ఆ తరువాత భారత్ ఖాతాలోకి మరో పసిడి పతకం వచ్చి చేరింది. టేబుల్ టెన్నిస్ పురుషుల జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది. తుదిపోరులో భారత జట్టు నైజీరియాపై 3-0 తేడాతో విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో భారత్ కు ఇది తొమ్మిదో స్వర్ణం కావడం విశేషం. ఇక తాజాగా భారత్ మిక్సిడ్ డబ్సుల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్ లో తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. మునుపెన్నడూ లేని విధంగా సైనా అద్భుత తీరులో అడి.. ఢిపెండింగ్ చాంఫియన్స్ మలేసియా జట్టను ఓడించి స్వర్ణాన్ని అందుకుంది.
ఇక పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఓమ్ మితర్వాల్ కాంస్యం పతకాన్ని సాధించాడు. ఇక ఇదే ఈవెంట్ లో మహిళల విభాగంలో జరిగిన పోటీలలో మెహులి ఘోష్, అపూర్వి చండేలా రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల 105 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో ప్రదీప్ సింగ్ మొత్తం 360 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇప్పటి వరకు గెలిచిన పతకాలతో భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అగ్రస్థానాల్లో ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more