ప్రపంచస్థాయిలో స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారులుగా వెలుగొందుతున్న భారత షెటర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇటు దేశీయంగా అవార్డులను అందుకున్నారు. తాజాగా స్పోర్ట్స్ పర్సన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను సింధూ, శ్రీకాంత్ లు దక్కించుకున్నారు. కాగా ఉత్తమ కోచ్ అవార్డును పుల్లెల గోపీచంద్ కైవసం చేసుకున్నారు. ఈఎస్పీఎన్ తొలిసారిగా పలు విభాగాల్లో క్రీడాకారులకు అవార్డులు ప్రకటించింది. 11 విభాగాలకు చెందిన క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా ఈ అవార్డులను ప్రకటించారు.
అభినవ్ బింద్రా, సోమ్ దేవ్, బైచుంగ్ భూటియా, జగ్బీర్ సింగ్, రోహిత్ బ్రిజ్ నాథ్, వెంకటేశన్ దేవరాజన్, నిషా మిల్లట్, అపర్ణ పొపట్, జగదీశ్, మనీషా, అంజుబాబీ జార్జ్ తో కూడిన జ్యూరీ బృందం విజేతలను ఈ 11 అంశాలలో విజేతలను ప్రకటించింది. గత ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు సొంతం చేసుకున్న కిదాంబి శ్రీకాంత్ కు పురుషుల విభాగంలో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపిక చేశారు. ఇక మహిళల విభాగంలో పీవీ సింధుకు ఈ అవార్డు దక్కింది. ఇక కోచ్ విషయానికి వస్తే పుల్లెల గోపీచంద్ బెస్ట్ కోచ్ అవార్డును కైవసం చేసుకున్నారు.
ఆసియా కప్ గెలిచిన మహిళల హాకీ జట్టును ‘టీం ఆఫ్ ద ఇయర్’గా ప్రకటించారు. గత ఏడాది భారత్లో అండర్-17 ఫిఫా ప్రపంచకప్ లో భారత్ తరఫున ఏకైక గోల్ ను జీక్సన్ సింగ్ సాధించిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ పోల్ లో దీనికే ఎక్కువ మంది ఓటు వేయడంతో ‘మూమెంట్ ఆఫ్ ద ఇయర్’గా ఇది నిలిచింది. దీంతో మొత్తానికి పదకొండు విభాగాలకు చెందిన క్రీడాకారుల ప్రతిభ అవార్డులను ఈఎస్పీఎన్ సంస్థ వెల్లడించి అవార్డులను ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more