ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ రజతం, కాంస్య పతకాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నొజొమి ఒకుహర చేతిలో ఓడిన సైనా కాంస్యంతో సరిపెట్టుకుంది. అదే జపాన్ క్రీడాకారిణి చేతిలో ఫైనల్లో ఓడిన సింధు రజతం దక్కించుకుంది. టోర్నీలో భాగంగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ పోరు సుమారు 110 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది.
ఈ మ్యాచ్ని భారీ సంఖ్యలో అభిమానులు తిలకించారు. పతకం అందుకోవడానికి అక్కడే ఉన్న సైనా నెహ్వాల్.. సింధు-ఒకుహర ఫైనల్ పోరును గ్యాలరీలో కూర్చుని స్వయంగా వీక్షించింది. పోరాట పటిమ, కసి, గెలుపు ఆకాంక్షతో నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరును చూస్తున్న సైనాకు మాటల్లేవు. ఒక్కో పాయింట్ కోసం ప్రత్యర్థులు పోరాడిన తీరు చూసి ఆశ్చర్యపోయిన సైనా మ్యాచ్ అనంతరం సింధు కోచ్ పుల్లెల గోపిచంద్ను అభినందించింది.
ఈ నేపథ్యంలో సైనా ‘ఈ మ్యాచ్ చూస్తే నాలో పెట్రోలు అయిపోయిందన్న భావన కలుగుతోంది’ అని గోపిచంద్ తో వ్యాఖ్యానించిందని.. అయితే దానిపై స్పందించిన గోపిచంద్ ‘ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక సమయంలో పెట్రోలు అయిపోవాల్సిందే. అప్పటి వరకు పోరాటం మాత్రం ఆగకూడదని బదులిచ్చాడని ఓ జాతీయ మీడియా పేర్కోనింది. అయితే అమె వ్యాఖ్యలకు అంతే ఘాటుగా గోపిచంద్ బదులివ్వడానికి కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే సైనా నెహ్వాల్ కూడా ఒకప్పుడు గోపిచంద్ శిష్యురాలే అన్న విషయం తెలిపిందే.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more