భారత షెట్లర్ స్టార్.. తెలుగు తేజం పీవీ సింధు, మరో స్టార్ సైనా నెహ్వాల్ ఇద్దరూ బీడబ్యూఎఫ్ తాజాగా ప్రకటించిన ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాకింగ్ లో ఒక్కో స్థానం దిగజారారు. ప్రపంచ మూడో ర్యాంకర్ గా వున్న సింధూ ఒక్క స్థానం దిగజారి నాలుగో స్థానానికి పరమితం కాగా, సైనా నెహ్వాల్ కూడా ఒక్క స్థానం దిగజారి తొమ్మిదవ స్థానానికి పరిమితం అయ్యారు. ఇద్దరూ తాజాగా అడిని అసియా చాంఫియన్ షిఫ్ పోటీలలో ప్రతిభను కనబర్చడంలో విఫలం కావడంతోనే వారి ర్యాంకులు దిగజరాయి.
సైనా నెహ్వాల్ తొలి రౌండ్ లోనే ఇంటిముఖం పట్టగా, సింధూ క్వార్టర్ ఫైన్సల్ లో వెనుదిరిగింది. దీంతోనే వారికి ర్యాంకులు వెనక్కు జరిగాయి. ఇక పురుషుల సింగిల్స్ లో అజయ్ జయరాం 13వ స్థఆనంలో కొనసాగుతూ బెస్ట్ ర్యాంక్డ్ ఇండియన్ గా నిలువగా, సింగపూర్ సూపర్ సిరీస్ చాంఫియన్ షిఫ్ కొట్టిన సాయి ప్రణిత్ 22 స్థానానికి ఎగబాకాడు. ఇక ప్రపంచ మూడో ర్యాంకర్ గా కొనసాగిన కిదాంబి శ్రీకాంత్ 26వ స్థానంలో కొనసాగుతున్నాడు. మహిళల డబుల్స్ విభాగంలో రాణిస్తున్న అశ్వనీ పోన్నప్ప, సిక్కి రెడ్డిలు 28వ స్థానాన్ని పధిలం చేసుకున్నారు.
సింధూకు ఇంటిస్థలం కేటాయింపు
పివి సింధుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి గజాల స్థలం కేటాయించింది. రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించినందుకు కానుకగా ఈ భూమిని కేటాయించింది. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించిన పత్రాలను ఈ రోజు సింధుకు అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు సింధు, ఆమె తల్లిదండ్రులు తమ ధన్యవాదాలు తెలిపారు. కాగా, నగరంలో ఇంటి నిర్మాణం నిమిత్తం సింధుకు భూమిని ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more