ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కరొలినా మారిన్ చేసిన వ్యాఖ్యలకు భారత ఏస్ షెట్లర్ సైనా నెహ్వాల్ దిమ్మతిరిగే బదులిచ్చింది. ఇండియన్ ఓపెన్ సిరీస్ లో ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఒకే వేదికపై మాట్లాడిన క్రీడాకారిణులు.. ఒకరిపై ఒకరు పంచులు వేసుకున్నారు. తొలుత ప్రపంచ నాలుగో ర్యాంకులో కొనసాగుతున్న స్పెయిన్ షెట్టర్ కారోలినా మరియ మారిన్ మార్టిన్ మాట్లాడుతూ, టోర్నీలో విజయం సాధించడమే తన లక్ష్యమని చెప్పింది.
అయితే అదే సమయంలో సైనా నెమ్వాల్ ను వరల్డ్ నెంబర్ వన్ కాకుండా అడ్డుకుంటానని కూడా చెప్పి అక్కడున్నవారిని విస్మయానికి గురి చేసింది. ఆ తరవాత అవకాశం లభించిన నేపథ్యంలో భారత స్టార్ షెట్లర్ సైనా మాట్లాడుతూ తాను ఎప్పుడు ర్యాంకుల కోసం అడలేదని చెప్పింది. కోర్టులోకి దిగిన వెంటనే తనకు కేవలం దేశం మాత్రమే గుర్తువుంటుంది తప్ప ఇతరాత్రాలు ఏమీ గుర్తుకు రావని తెలిపింది.
అయితే తాను గత పదేళ్ల నుంచి టాప్ టెన్ లో వున్నానాని, ఇక ప్రపంచ నెంబర్ వన్ స్థానంలో తాను ఎప్పుడో కొనసాగానని, ఇక ఇప్పుడు దానిని నిలువరించాలని అనుకోవడం మారిన్ అవివేకమని చెప్పుకోచ్చింది. అంతేకాకుండా తనను నెంబర్ వన్ కాకుండా అడ్డుకుంటానన్న వాళ్లు.. వాళ్లైనా నెంబర్ వన్ స్థానాన్ని చేరుకుంటారా..? అంటే అదీ లేదన్నారు. ఒకవేళ చేరుకుంటే మాత్రం తాను సంతోషిస్తానన్నారు. సైనా నుంచి ఈ ఊహించని జవాబు రావడంతో కరోలినా మారిన్ దిమ్మదిరిగింది. 30వ ర్యాంకులో ఉన్నప్పటి నుంచి తాను టోర్నీలు గెలవడం గురించే ఆలోచించానని చెప్పింది. టోర్నీలు గెలుస్తూ ఉంటే ర్యాంకులు ఆటోమేటిగ్గా మెరుగవుతాయని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more