క్రీడలతో మానసికోల్లాసంతో పాటు బుద్దిబలం కూడా పెంపోందుతుందన్న పెద్దల మాట.. భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా విషయంలో అక్షరాల నిజమైంది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో అరేళ్ల క్రితం అమె వివాహం జరిగిన విషయం అభిమానులందరికీ తెలిసిందే. ఆ మధ్య వీరిద్దరి మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయని.. వార్తలు రాగా, అలాంటిదేమీ లేదని వారు ఖండించారు. ఆ తరువాత పాకిస్తాన్ గెలుపోందిన ఓ మ్యాచ్ సందర్భంలో భర్తతో కలసి డాన్స్ చేసింది.
ఈ విషయాన్ని పక్కనబెడితే.. తాజాగా సానియా మిర్జా ఓ టీవీ ఛానెల్ నిర్వహించే 'యాదోంకీ బారాత్' కార్యక్రమంలో పాల్గోనింది. తన స్నేహితురాలైన బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాతో కలసి సానియా మీర్జా ఈ షోలో పాల్గొనింది. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ నుంచి టెన్నీస్ బంతుల్లాంటి ప్రశ్నలకు అమె చకచకా బదులిచ్చింది. అయితే ఈ క్రమంలో సానియాకు ఊహించని ప్రశ్నను సంధించాడు సాజిద్ ఖాన్.
భారత్, పాకిస్థాన్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సానియా, షోయబ్ మాలిక్ లకు భగవంతుడి అశీర్వాదంతో పిల్లలు కలిగి పెరిగి పెద్దైన తరువాత క్రీడాకారులైతే.. వారు ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ ప్రశను ప్రతి భారత, పాకిస్థాన్ పౌరుల తరఫున తాను అడుగుతున్నానని ముందే విన్నవించారు. ‘‘మీకు, షోయబ్ మాలిక్ కు కుమారుడు పుట్టి, ఆటగాడైతే, ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు?" అని సాజిద్ ఖాన్ అడిగాడు. ఎవరైనా ఇలాంటి ప్రశ్నకు సమాధానాన్ని ధాటవేస్తారు.
కానీ సానియా మిర్జా మాత్రం అలా చేయలేదు.. ఏ మాత్రం కంగుతినకుండా.. అమె చాలా బోల్డుగా సమాధానాన్ని ఇచ్చింది. తాము ఎప్పుడూ ఈ విషయాన్ని గురించి అలోచించలేదని, కనీసం ఎన్నడూ చర్చించలేదని చెప్పింది. ఈ ప్రశ్నకు సమాధానం తమకు కూడా తెలియదని చెప్పింది. అయితే తమ బిడ్డ ఆటగాడే ఎందుకు కావాలి? నటుడు కావచ్చు. టీచర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు కదా..? అని ఎదురు ప్రశ్నించింది. అయినా ఇది చాలా దూరంలో ఉన్న విషయం. భారతీయురాలినైనందుకు తానెంతో గర్విస్తున్నాను. పాకిస్థానీ అయినందుకు అతనూ అంతే. మేమిద్దరమూ కలిస్తే, భార్యాభర్తలమైనందుకు ఇంకా ఎంతో గర్విస్తుంటామని సానియా సమాధానం ఇచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more