ఆసియా కప్ అండర్-18 హాకీ టోర్నమెంట్లో భారత జూనియర్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 3-1 గోల్స్తో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో నీలం సంజీప్ ఎక్సెస్ నేతృత్వంలోని జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఫార్వర్డ్ ఆటగాడు శివమ్ ఆనంద్ (7వ నిమిషం), స్ట్రయికర్ దిల్ప్రీత్ సింగ్ (32వ ని.), కెప్టెన్ సంజీప్ (46వ ని.) తలా ఒక గోల్ చేశారు. ప్రత్యర్థిని ఎక్కడికక్కడ నిలువరించడంలో రక్షణ పంక్తి కూడా సఫలమైంది.
ఆరంభం నుంచి అటాకింగ్తో పైచేయి సాధించాలని ఇరు జట్లు దూకుడు ప్రదర్శించారు. అయితే భారత కుర్రాళ్ల జోరు ముందు పాక్ దాడులు తేలిపోయాయి మ్యాచ్ ఏడో నిమిషంలోనే ఆనంద్ ఫీల్డ్ గోల్ సాధించగా, అనంతరం దిల్ప్రీత్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచాడు. దీంతో భారత్ 2-0తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. ద్వితీయార్ధంలోనూ ఇదే జోరును కొనసాగించడంతో పాకిస్తాన్ కోలుకోలేకపోయి0ది. రెండో అర్ధభాగంలో కెప్టెన్ సంజీప్ పెనాల్టీ కార్నర్ని గోల్పోస్ట్లోకి పంపిస్తే... పాక్ తరఫున నమోదైన ఏకై క గోల్ను అంజద్ అలీ ఖాన్ 63వ నిమిషంలో చేశాడు.
ఈ జట్టుకు లభించిన పలు పెనాల్టీ కార్నర్లను గోల్ కాకుండా భారత ఆటగాళ్లు అడ్డుగోడగా నిలబడ్డారు. మ్యాచ్ ఆసాంతం చక్కని పోరాటం చేసిన మిడ్ఫీల్డర్ కున్వర్ దిల్రాజ్ సింగ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. పాక్ను ఓడించిన భారత కుర్రాళ్లను కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. శుక్రవారం జరిగే ఫైనల్లో భారత్... ఆతిథ్య బంగ్లాదేశ్ను ఢీకొంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more