బెల్జియంలోని యాంట్వార్స్ లో జరుగుతున్న హాకీ మ్యాచ్ లో భారత్ బొక్కబోర్లా పడింది. అథిత్య జట్టు బెల్జియం స్ట్రయికర్లు దాడుల ముందు భారత్ తెల్లముఖం వేయడం మినహా ఏమీ చేయలేకపోయింది. భారత ఢిపెన్సు బెల్జియం స్ట్రయికర్లను ఎదుర్కోవడంతో విఫలం చెందారు. ఆ తరువాత కోలుకున్నా అప్పటికే ప్రత్యర్ధి జట్టు మ్యాచ్ ను ఎగురేసుకుపోయింది. దీంతో హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైన్సల్ లో భారత్ కు ఫైనల్ భెర్త్ దూరమైంది. బెల్టిజయం 4-0తో భారత్ పై నెగ్గింది. తుది పోరుకు అర్హత సాధించిం ఫైనల్స్ లోకి వెళ్లింది.
బెల్జియం స్ట్రయికర్ వాన్ అబెల్ ఫోరెంట్ అత్యుత్తమ ఆటతీరు ప్రేక్షకులను మంత్రముగ్దల్ని చేసింది. మ్యాచ్ ఆరంభంలోనే రెండో నిమిషంలో భారత్ డిఫెన్స్ ను చిత్తు చేసి గోల్ సాధించాడు. ఆ తరువాత 41 నిమిషయంలో, మూడవ గోల్ 53 వ నిమిషంలో చేసి భారత్ పై హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. కోస్సిన్స్ టాంగే 8వ నిమిషంలో సాధించిన గోల్ సహా మొత్తంగా బెల్జియం నాలుగు గోల్స్ సాధించి భారత్ ను కోలుకోలేని దెబ్బ తీసింది. బెల్జియం ఆటగాళ్లు మెరుపు వేగంతో అడటం.. వారిని ఎదుర్కోన్నే క్రమంలో భారత ఢిపెన్స్ నిష్చేష్టులై నిమ్మకుండంతో గెలుపు వారి సోంతమైంది. కాగా ఐదవ స్థానం కోసం జపాన్ తో భారత్ హాకీ జట్టు తలపడనుంది.
రియో ఒలింపిక్స్కు దూరమైన పాక్.. ఆశలు గల్లంతు..
పాకిస్థాన్ హాకీ జట్టుపై ఐర్లాండ్ విజయం సాధించింది. దీంతో రియో ఒలింపిక్స్కు అర్హత సాధించాలని భావించిన పాక్ ఆశలు గల్లంతు అయ్యాయి. పాకిస్థాన్ హాకీ చరిత్రలో ఒలింపిక్స్కు అర్హత సాధించలేకపోవడం ఇదే తొలిసారి. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్లో ప్లేఆఫ్ మ్యాచ్లో పాకిస్థాన్పై ఐర్లాండ్ 1-0 గోల్ తేడాతో సంచలనం విజయం సాధించింది. పాకిస్థాన్తో 11 వరుస పరాజయాల తరువాత ఐర్లాండ్ సాధించిన తొలివిజయం ఇది. కాగా, ఈ ఓటమితో పాకిస్థాన్ 2016 రియో ఒలింపిక్స్కు అర్హత సాధించలేకపోయింది. గత ఏడాది జరిగిన ఆసియా గేమ్స్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయిన తరువాత ఒలింపిక్స్కు అర్హత సాధించడానికి పాక్కు ఇదే చివరి అవకాశం. ఈ అవకాశాన్ని పాక్ చేజార్చుకుంది.
మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ ' పాక్ హాకికి ఇది దుర్ధినం' అని వ్యాఖ్యానించాడు. ఒలింపిక్స్కు అర్హత సాధించలేకపోవడం పాకిస్థాన్కు ఇదే తొలిసారి. ఒలింపిక్స్లో పాకిస్థాన్ హాకీ జట్టుకు విజయవంతమైన జట్టుగా పేరుఉంది. ఒలింపిక్స్లో మూడు సార్లు స్వర్ణ పతకాలను పాక్ కైవసం చేసుకుంది. ఈ అంశంలో పాక్ మూడో స్థానంలో ఉంది. భారత్ హాకీ జట్టు 8 సార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు గెలుచుకుంది. జర్మనీ నాలుగు స్వర్ణ పతకాలు సాధించింది. కాగా, గత ఏడాది ప్రపంచకప్కు పాకిస్థాన్ అర్హత సాధించ లేకపోయింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more