పురుషులకంటే మహిళలకు ఏమాత్రం తక్కువ కాదంటూ అన్ని రంగాలలోనూ తమ సత్తా చాటుకుంటూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. ఈమధ్యకాలంలో అయితే మహిళలు తమ వేగాన్ని మరింత పెంచేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే జరిగిన ఆసియా క్రీడల్లో పురుషులకంటే మహిళలే ఎక్కువ విజయాలను నమోదు చేయగలిగారు. ఆ క్రీడల్లో తెలుగు అమ్మాయిలు కూడా కీలకపాత్రను పోషించారు. బహుశా వారి స్ఫూర్తితోనే ప్రస్తుత క్రీడాకారులు దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా మరో తెలుగమ్మాయి అయిన బొడ్డా ప్రత్యూష చెస్ క్రీడలో ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ దక్కింది.
చెస్ క్రీడలో మొదటినుంచి బాగా ప్రదర్శించుకుంటూ మెరుగైన క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన ప్రత్యూషకు ఈ టైటిల్ దక్కడం విశేషం! అక్టోబర్ నెలలో జరిగిన ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్ కు ముందు 2,078 పాయింట్లతో వున్న ప్రత్యూష.. ఆ టోర్నీలో 90 పాయింట్లను తన ఖాతాలో జమచేసుకుంది. అలాగే ప్రస్తుతం మహారాష్ట్రంలో జరుగుతున్న జాతీయ మహిళ ప్రీమియర్ చెస్ టోర్నీలోనూ తన దూకుడును కంటిన్యూ చేస్తోంది. ఆ టోర్నీలోని ఐదో రౌండు ముగిసేసరికి ప్రత్యూష 42 రేటింగ్ పాయింట్లు సాధించింది. దీంతో ఆమె మొత్తం 2210 పాయింట్లను సొంతం చేసుకున్న ప్రత్యూష.. ఐఎం టైటిల్ ను సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలోనే ప్రత్యూష మాట్లాడుతూ.. గ్రాండ్ మాస్టర్ కావడమే తన లక్ష్యమని.. దీన్ని వచ్చే ఏడాదిలోపే పూర్తి చేస్తానని ఛాలెంజ్ చేసింది. ఇదిలావుండగా.. మహారాష్ట్రలో జరుగుతున్న జాతీయ ప్రీమియర్ చెస్ టోర్నీలో ప్రత్యూష ఐదో రౌండ్లో హిందూజా రెడ్డిని ఓడించి.. 2.5 పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ వేగంతోనే ఈమె తన ప్రతిభను చాటుకుంటూ దూసుకెళ్తే.. త్వరలోనే తన కోరికను తీర్చుకునే అవకాశాలు చాలానే వున్నాయి. ఈమె ఇంటర్నేషనల్ మాస్టర్ గా టైటిల్ సాధించడంతో అభిమానులతోపాటు కొంతమంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more