సైనా నెహ్వాల్.. ఎందరో దిగ్గజ బ్యాడ్మింటన్ ప్లేయర్లకు సాధ్యంకాని కొన్ని ఘనతలను సొంతం చేసుకుని ఓ సంచలనంగా నిలిచిపోయిన స్టార్! నెంబర్ వన్ చైనాను సైతం చెమటలు పట్టించి భారత్ కు అండగా నిలిచింది. ఎవ్వరూ సాధించలేని పతకాలను తన ఖాతాలో వేసుకుని బ్యాడ్మింటన్ చరిత్రలో ఇండియాకు గొప్ప పేరు సంపాదించిపెట్టింది. అటువంటి స్టార్ క్రీడాకారిణి చేసిన ఒక తప్పు వల్ల ఇప్పుడు భారత్ కు ఏకంగా కోటి 70 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. మొన్నటివరకు ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభతో భారత్ గొప్పతనాన్ని చాటిచెప్పిన ఈ అమ్మడు... ఇప్పుడు ఆమె వల్లే భారత్ కు ఎంతో అగౌరవం మిగిలిందనే వార్తలు వస్తున్నాయి.
అసలు విషయం ఏమిటంటే.. ఒలంపిక్స్ లో కాంస్య పతకం గెలిచిన తర్వాత నుంచి సైనా నెహ్వాల్ వరుసగా జరుగుతున్న టోర్నమెంట్ లో ఓడిపోతూనే వుంది. ఏ ఒక్క టోర్నమెంట్లోనూ కనీసం రన్నరప్ వచ్చిన సందర్భాలూ లేవు. మహా అయితే క్వార్టర్ ఫైనల్ దాకా చేరుతోంది కానీ.. సెమీస్ లో కూడా స్థానం సంపాదించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన ఆసియా క్రీడల్లో, డెన్మార్క్ ఓపెన్ లో మొదట్లోనే వెనుదిరిగి వచ్చేసింది. దాంతో భారతీయ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే అంతలోనే మొదలైన ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ లో సైనా నెహ్వాల్ పోరాటం కొనసాగించింది. కానీ అందులో కూడా ఎటువంటి ఫలితం దక్కలేదు. పైగా అందులో పరాజయం కావడం వల్లే భారత్ కు ఇంత నష్టం వాటిల్లింది.
అయితే ఈ భారీ నష్టం ఏమిటంటే.. ఒకవేళ ప్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ సైనా నెహ్వాల్ గెలిచివుంటే ఆ ఆటపై వున్న కోటీ 70 లక్షల ప్రైజ్ మనీ దక్కి వుండేది. కానీ ఆమె క్వార్టర్స్ లోనే వెనుదిరగడం వల్ల చేతికందాల్సిన ఆ ప్రైజ్ మనీ ఒక్కసారిగా చేజారిపోయింది. దీంతో భారత్ కు రావాల్సిన ఆ డబ్బులు రాకుండా పోవడంతో నష్టం వచ్చిందని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. క్వార్టర్ ఫైనల్ లో చైనాకు చెందిన రెండో సీడెడ్ క్రీడాకారిణి షిసియాన్ వాంగ్ చేతిలో సైనా 19-21, 21-19, 15-21 తేడాతో ఓడిపోయింది. ఈ గెలుపుతో ఆమె వరుసగా ఐదుసార్లు సైనాపై గెలిచినట్లయింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more