(Image source from: haryana govenment presenting high prize money for commonwealth and asia games winners)
కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో తమ సాయశక్తులను ఉపయోగించి క్రీడాకారులు ఎంతో కష్టంగా పతకాలను గెలుచుకుంటే... దానిని ప్రభుత్వం మాత్రం బేరాలాడుతూ సింపుల్ గా పనిని కానిచ్చేస్తున్నారు. అయితే ఇక్కడ బేరాలాడుతున్నది తమ సొంత ప్రయోజనాలకోసం కాదులెండి... క్రీడల్లో ఎవరైతే మంచి ప్రతిభను ప్రదర్శిస్తారో వారికి ఆ పతకానికి తగ్గట్టు బహుమానాలను ప్రకటించింది హర్యానా ప్రభుత్వం. ప్రత్యేకంగా తమ రాష్ట్ర క్రీడాకారుల కోసమే ఈ భారీ నజరానాను వారు ఏర్పాటు చేశారు.
కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాలతో బాగా రాణించిన క్రీడాకారులకు హర్యానా ప్రభుత్వం సదరు ఆటగాళ్లకు భారీ మొత్తాన్ని బహుమతిగా సమర్పించనున్నట్టు ప్రకటించింది. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిస్తే కోటి రూపాయలుకాగా.. రజతానికి రూ.50 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షల నజరానాను ఇస్తున్నట్టు ఆ ప్రభుత్వం పేర్కొంది. అయితే గతంలో మాత్రం స్వర్ణానికి 25 లక్షలు, రజతానికి రూ.10 లక్షలు, కాంస్యానికి రూ.5 లక్షలు మాత్రమే వుండగా... ఇప్పుడు తాజాగా భారీ నజరానాను ప్రకటించడం హాట్ టాపిక్ గా మారిపోయింది.
అలాగే ఆసియా క్రీడల్లో స్వర్ణపతకం పొందినవారికి రూ.2 కోట్లు, రజతానికి రూ.కోటి, కాంస్యానికి రూ.50 లక్షలు ఇవ్వనున్నట్టు కూడా పేర్కొంది. గతంలో మాత్రం స్వర్ణానికి రూ.25 లక్షలు, రజతానికి రూ.15 లక్షలు, కాంస్యానికి రూ.10 లక్షల నజరానాను మాత్రమే ప్రకటించింది. ఈమేరకు బుధవారంనాడు హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ ఈ కొత్త నజరానాలను ప్రకటించించారు. ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో తమ ఆటగాళ్లు బాగా రాణిస్తున్న నేపథ్యంలో ఆయన హర్షం వ్యక్తం చేస్తూ.. ఈ విధంగా భారీ నజరానాను ప్రకటించేశారు.
ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే తమ రాష్ట్రానికి చెందిన కొందరు క్రీడాకారులు 3 స్వర్ణ, 5 రజత పతకాలను గెలుచుకున్నారని ఆయన అన్నారు. తమ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులను మరింతగా ప్రోత్సాహించడం కోసమే ఇంత భారీ నజరానాను ప్రకటించామని ఆయన స్పష్టం చేశారు. సహజంగానే హర్యానా రాష్ట్రం క్రీడాకారులను ప్రోత్సాహించడంలో మిగతా రాష్ట్రాలకంటే ఎంతో ముందుంది. గతంలో ఒలంపిక్స్ క్రీడలు జరిగినప్పుడు కూడా హర్యానా ప్రభుత్వం తమ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ స్వర్ణ పతకానికి రూ.5 కోట్లు, రజతానికి రూ.3 కోట్లు, కాంస్యానికి రూ.2 కోట్లమేర నజరానాను ప్రకటించి క్రీడాలోకం నుంచి ఎన్నో మన్ననలు పొందింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more