భారత మాజీ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. తన కల సాకారం చేసుకోవడం కోసం ఆమె అత్యంత కీలమైన కెరీర్ నే పనంగా పెట్టారు. తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకువచ్చిన క్రికెట్ కెరీర్ కన్నా ఉన్నతమైన స్వప్నం ఏంటనేగా మీ సందేహం. దేని కోసం 36 ఏళ్ల మిథాలీ.. ఈ నిర్ణయం తీసుకుంది.? క్రికెట్ అంటే కేవలం అంతర్జాతీయ టీ20 కెరీర్ కు ఆమె వీడ్కోలు ప్రకటించింది. ఇంతకీ అమె కల ఏమిటంటారు.? అంటే టార్గెట్ 2021 ఐసీసీ వన్డే వరల్డ్ కప్.
ప్రపంచ కప్ ను సాధించేందుకు ఆమె టీ20 మ్యాచ్ కెరీర్ ను పక్కనబెట్టారు. ఇప్పటివరకు మిథాలీ భారత తరపున మొత్తం 32 టీ20 మ్యాచులు ఆడింది. అందులో మూడు ఎడిషన్లు (2012 (శ్రీలంక , 2014 (బంగ్లాదేశ్, 2016 ఇండియా) మహిళల వరల్డ్ కప్ టీ20 మ్యాచ్లు ఆడింది. ‘2006 నుంచి భారత మహిళా క్రికెట్ జట్టుకు టీ20అంతర్జాయ మ్యాచులకు కెప్టెన్ గా వ్యహరిస్తూ వచ్చాను. అంతర్జాతీయ టీ20ల నుంచి వీడ్కోలు పలకాలని భావిస్తున్నాను. రానున్న 2021 వన్ డే వరల్డ్ కప్ పైనే దృష్టి పెట్టాను. అందుకు తగినట్టుగా రెడీ కావాల్సిన అవసరం ఉంది. నా దేశం కోసం ప్రపంచ కప్ లో విజయం సాధించడమే నా కల. నాకు సాధ్యమైనంత వరకు కష్టపడతా’ అని మిథాలీ చెప్పినట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
‘భారత మహిళా టీ20ను ప్రోత్సహించిన బీసీసీఐకి నా కృతజ్ఞతలు. దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో హోం సిరీస్ కు సిద్ధమయ్యే భారత మహిళా టీ20 జట్టుకు నా శుభాకాంక్షలు’ అని మిథాలీ ట్వీట్ చేసింది. టీ20 మ్యాచ్ల్లో అత్యధికంగా 2వేలు పరుగుల ల్యాండ్ మార్క్ చేరిన తొలి భారతీయ క్రికెటర్గా మిథాలీ నిలిచింది. మరోవైపు.. భారత మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ ల టీ20 హోం సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 24 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఫిబ్రవరి-మార్చి 2020లో ఆస్ట్ర్రేలియాలో టీ20 ప్రపంచ కప్ ఆడనుంది.
BREAKING: @M_Raj03 announces retirement from T20Is
— BCCI Women (@BCCIWomen) September 3, 2019
She led India in 32 T20Is including the three Women’s WT20 World Cups in 2012 (Sri Lanka), 2014 (Bangladesh) and 2016 (India).
More details here - https://t.co/Yuv1CaCXFv pic.twitter.com/Y6n5irOoME
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more