ఐపీఎల్ ఫైనల్ పోరుకు ముందు భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే తన 2019 ఉత్తమ ఐపీఎల్ జట్టును ప్రకటించాడు. ధోనీని కెప్టెన్సీ పగ్గాలను అందించిన ఈ క్రికెటర్ ఆశ్చర్యకరంగా రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ కు జట్టులో స్థానం కల్పించాడు. టీమిండియా జట్టులో ధోనీ, రాహుల్, పాండ్య, బుమ్రా మినహా మరెవరికీ అవకాశం ఇవ్వని మాజీ కోచ్ ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు కూడా ఈ జట్టులో చోటు కల్పించారు. తన జట్టులో ఆటగాళ్ల ఎంపికపై కుంబ్లే వివరణ ఇచ్చాడు.
కుంబ్లే జట్టు సభ్యులను ఎంపికపై వివరణ ఇస్తూ ‘శ్రేయస్ అయ్యర్ను ఎందుకు తీసుకున్నానంటే.. అతను సత్తా ఉన్న ఆటగాడు. ఇప్పటికే ఐపీఎల్ లో రాణించాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ బాధ్యత తీసుకొని బ్యాటింగ్ చేస్తాడు. ఢిల్లీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించదు. అయినా, శ్రేయస్ బ్యాటింగ్ చేసి చూపించాడు. 16 మ్యాచుల్లో 463 పరుగులు చేశాడు’ అని కుంబ్లే తెలిపాడు. సన్రైజర్స్ బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ను తీకున్నప్పటికీ మరో ఓపెనర్ బెయిర్స్టోకు అవకాశం ఇవ్వలేదు. అతని స్థానంలో కేఎల్ రాహుల్కు అవకాశం ఇచ్చాడు.
దీనిపై వివరణ ఇస్తూ.. ‘వార్నర్, బెయిర్ స్టో ఇద్దరూ ప్రమాదకరమైన బ్యాట్స్మెన్లే. నేను కూడా బెయిర్స్టోను తీసుకోవాలని అనుకున్నా. కానీ, జట్టు సమతూకం కోసం రాహుల్ ను ఎంచుకున్నాను’ అని తెలిపాడు. మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్య, రసెల్ కు కచ్చితంగా చోటు కల్పించాల్సిందే. ఎందుకంటే.. ఈ సీజన్ లో టీ20 క్రికెట్ కు అర్థం చెప్పింది వాళ్లిద్దరే అన్నాడు. అయితే, రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ కు జట్టులో స్థానం కల్పించడంపై మాత్రం వివరణ ఇవ్వలేదు.
కుంబ్లే ప్రకటించిన 2019 ఐపీఎల్ జట్టు..
ధోనీ(కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్పంత్, హార్దిక్ పాండ్య, అండ్రూ రసెల్, శ్రేయస్ గోపాల్, ఇమ్రాన్ తాహీర్, కగిసో రబాడా, జస్ప్రీత్ బుమ్రా.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more